Posted on 2026-06-12 19:08:10
ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాల కార్మికులను పనుల్లో నియమించవద్దని, బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందివ్వాలని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు అన్నారు.
శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, డిఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల బాల్యాన్ని, విద్యా అవకాశాలను, శారీరక మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సదస్సులో న్యాయవాదులు సురేష్, రాజు, పారా లీగల్ వాలంటీర్ లావణ్య, న్యాయ సేవ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >