Posted on 2026-06-12 22:38:10
ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాల కార్మికులను పనుల్లో నియమించవద్దని, బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందివ్వాలని లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాది ఆడెపు వేణు అన్నారు.
శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, డిఎల్ఎస్ఏ పి.లక్ష్మణాచారి సమన్వయంతో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల హక్కుల పరిరక్షణ, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ పిల్లల బాల్యాన్ని, విద్యా అవకాశాలను, శారీరక మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సదస్సులో న్యాయవాదులు సురేష్, రాజు, పారా లీగల్ వాలంటీర్ లావణ్య, న్యాయ సేవ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >
తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-12 20:07:23
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-12 18:52:12
Readmore >
ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-06-12 18:48:24
Readmore >
హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి
Posted On 2026-06-12 12:51:28
Readmore >