| Daily భారత్
Logo




దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

News

Posted on 2026-06-12 18:04:48

Share: Share


దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

రూ. 50 వేల చెక్కు అందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఇద్దరు దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేశారు. బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కళ్యాణం కొమురవ్వకు నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు దివ్యాంగులు. దివ్యాంగురాలైన సాగరిక, దివ్యాంగుడైన వేణు అనారోగ్యానికి గురయ్యారు. వారికి ప్రభుత్వ,  ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం చేయించారు. కొమురవ్వ భర్త గల్ఫ్ కు వెళ్లి అక్కడే మరణించారు. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను కలిసి తమ ఇబ్బందులను విన్నవించారు. పిల్లలను చూసుకోవడం కోసం తాను ఇంటికే పరిమితమై పోయినది. కూలి పనులకు సైతం కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లా కలెక్టర్  తక్షణం స్పందించి జిల్లా సంక్షేమ అధికారితో విచారణ చేయించి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. దీంతో వారికి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం రూ.50 వేల చెక్కును  అందజేశారు. భవిష్యత్తులో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తమ పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్ కు కొమురవ్వ కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >