Posted on 2026-06-12 20:07:23
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం వీరభద్రపురం గ్రామ పరిధిలోని తాళిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువను జిల్లా కలెక్టర్ అంకిత్ IAS పరిశీలించి కాలువ పరిస్థితులు, నీటి ప్రవాహం, ఆయకట్టు వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తాళిపేరు నదిపై చర్ల మండలం పెద్దమిడిసిలేరు వద్ద నిర్మించిన ఈ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ద్వారా సుమారు 24,700 ఎకరాలకు సాగునీరు అందుతుండగా, ఎడమ కాలువ 46.46 కి.మీ పొడవుతో 34 డిస్ట్రిబ్యూటరీల ద్వారా సుమారు 21,100 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ రైతులకు సాగునీరు అంతరాయం లేకుండా అందేలా కాలువల నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పెరిగిన గడ్డి, చెత్త, మురుగును వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కాలువ వెంబడి దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, నీటి పంపిణీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కాలువల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో దుమ్ముగూడెం తాసిల్దార్ అశోక్ కుమార్, ఇరిగేషన్ ఈఈ జానీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >
తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-12 20:07:23
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-12 18:52:12
Readmore >
ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-06-12 18:48:24
Readmore >
హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి
Posted On 2026-06-12 12:51:28
Readmore >