Posted on 2026-06-12 18:15:03
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి డాక్టర్ అశ్వని తానాజీ వాకడే ఐఏఎస్ గారు పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఎలగందల్, కొత్తపల్లి మండలంలోని విద్యాసంస్థలను సందర్శించి మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎలగందల్ మోడల్ స్కూల్, జడ్పీహెచ్ఎస్ హైస్కూల్, కేజీబీవీ మరియు సాంఘిక సంక్షేమ హాస్టళ్లను సందర్శించిన ఆమె, అక్కడ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవనాల మరమ్మతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు.
పరిశీలనలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని వసతులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాసంస్థలను సన్నద్ధం చేయడం అధికారుల బాధ్యత అని పేర్కొన్న అదనపు కలెక్టర్, ప్రతి పనిని నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో టీజీడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్ గారు, ప్లానింగ్ సమన్వయాధికారి మిలుకూరి శ్రీనివాస్ గారు, కొత్తపల్లి మండల విద్యాధికారి తుమ్మా ఆనందం గారు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >