Posted on 2026-06-12 18:54:04
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ పార్క్ సందర్శన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ సిరిసిల్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రెక్కింగ్, వ్యాస రచన, చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
అలాగే విద్యార్థులు పార్క్లోని చెట్లు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, వాటి ప్రాముఖ్యత, ఉపయోగాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న మంజుల, సురేష్ పీడీ పాల్గొన్నారు.
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >
తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-12 20:07:23
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-12 18:52:12
Readmore >
ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-06-12 18:48:24
Readmore >
హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి
Posted On 2026-06-12 12:51:28
Readmore >