Posted on 2026-06-13 08:05:06
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక తదితర కాంట్రాక్ట్ పనుల్లో స్థానిక గిరిజనులకు అన్యాయం జరుగుతోందని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన త్యాగాల ఫలితాలు స్థానిక ప్రజలకు అందకుండా, నీళ్లు, నిధులు, నియామకాల ప్రయోజనాలు ఇతర ప్రాంతాల వారికి మళ్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఐదవ షెడ్యూల్, వన్ బై సెవెంటీ, పిసా చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి నిబంధనలను ఉల్లంఘిస్తూ సహజ వనరుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చిన కొందరు ఆంధ్ర కాంట్రాక్టర్లు స్థానిక గిరిజనుల భూములు, అడవులు, సహజ వనరులను దోచుకుంటున్నారని, దీనికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని అలెం కోటి విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన సహజ వనరుల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కొంతమంది కాంట్రాక్టర్లు రాజకీయ అండదండలు ఉన్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడం గిరిజన సమాజానికి, తెలంగాణ ప్రజలకు అవమానకరమని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, మేధావులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
లేనిపక్షంలో ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని, ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో గుణపాఠం చెబుతామని తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) సెల్:9848553277 హెచ్చరించారు
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >