Posted on 2026-05-22 19:30:45
డైలీ భారత్, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కొత్త కార్లు దగ్ధం అయ్యాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 8 కొత్త కార్లను తరలిస్తున్నారు. తూప్రాన్ శివారుకు చేరుకోగానే లారీ ఇంజిన్ నుంచి మంటలు రావడం గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే లారీని రోడ్డుపక్కకు నిలిపివేసినా.. క్షణాల్లోనే మంటలు భారీగా వ్యాపించాయి. మొదట క్యాబిన్లో చెలరేగిన మంటలు.. తర్వాత కంటెయినర్ వెనుక భాగంలోని కార్లకు వ్యాపించాయి. రామాయంపేట నుంచి చేరుకున్న ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కంటెయినర్తో పాటు అందులోని 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కోళ్ల ఫారమ్ దగ్ధం..
Posted On 2026-05-22 20:06:53
Readmore >
గంజాయి అక్రమ రవాణాపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-22 19:31:49
Readmore >
అంతర్రాష్ట్ర దొంగలపై రైల్వే స్టేషన్లలో 24 గంటల పోలీసుల నిఘా
Posted On 2026-05-22 19:22:23
Readmore >
రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!
Posted On 2026-05-21 23:23:22
Readmore >