Posted on 2026-05-22 16:01:49
385 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు అరెస్ట్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. మొత్తం 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో లారీలు మరియు బోలెరో వాహనాలను పరిశీలించగా గంజాయి తరలింపు వెలుగులోకి వచ్చింది. గంజాయిని అత్యంత చాకచక్యంగా దాచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రత్యేక బృందం అప్రమత్తంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా గంజాయి రవాణా లేదా విక్రయాలపై సమాచారం అందిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >