Posted on 2026-05-21 08:21:27
కామేపల్లి లో జిల్లా రైతు శిక్షణా తరగతులు
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ
డైలీ భారత్, కామేపల్లి: కేంద్ర ప్రభుత్వం ఎరువులు కంపెనీలు పెంచుతున్న ధరలను నియంత్రణ చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం కామేపల్లి మండల కేంద్రంలో లావుడ్యా రామా అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో రాంబాబు, కృష్ణ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కు ముందే కంపెనీలు రెండు దఫాలుగా ఎరువులు ధరలు పెంచాయి అని అన్నారు, యూరియా,డిఎపి మినహా మిగతా ఎరువులు రెండు వేల రూపాయలు దగ్గర కి చేరాయి అని అన్నారు.పెరిగిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు రైతులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఇప్పటికే సంక్షోభం లో ఉన్న రైతులపై అదనపు భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఎరువులు భారం రైతు పైన పడకుండా ధరలు నియంత్రణ చేయాలి అని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రైతు శిక్షణా తరగతులు జూన్ మొదటి వారంలో రెండు రోజులు కామేపల్లి మండలం లింగాల కాస్ర్ రోడ్డు మేకల ధనమ్మ పంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నాం అని రైతులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు సిఐటియు మండల కన్వీనర్ బాదావత్ శ్రీనివాసరావు, వీరాస్వామి, అంజయ్య, శాంతయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా
Posted On 2026-05-21 20:49:41
Readmore >
శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 18:50:39
Readmore >
“డిప్రెషన్ - Depression" (బలహీనత కాదు… చికిత్స అవసరమైన మానసిక వ్యాధి)
Posted On 2026-05-21 18:34:59
Readmore >
ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 11:42:53
Readmore >
మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్
Posted On 2026-05-21 08:19:55
Readmore >
సర్వే నెం. 444 లో అక్రమ నిర్మాణాలు... ఓ కార్పొరేటర్ అండతో అక్రమ నిర్మాణాల జాతర?
Posted On 2026-05-21 08:18:44
Readmore >