Posted on 2026-05-19 10:46:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాత కొత్తగూడెంలోని నూతన వెన్నెల నగర్ కాలనీలో సుమారు 270 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అక్కడ బేస్మెంట్ గోడలు స్లాబ్ లెవల్లో కట్టిన వారికి కొంతమందికి మొదటి బిల్లు కూడా పడలేదని సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ అన్నారు. నేడు జరిగిన ఇందిరమ్మ నిర్మాణ లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల ఇండ్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయని అలానే కొనసాగితే ఇండ్లు మొండి గోడలు గా మిగిలిపోయే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >