| Daily భారత్
Logo




64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు

News

Posted on 2026-05-15 20:17:21

Share: Share


64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు

ఒడిశా నుండి తమిళనాడుకు  గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు...

ఈ అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు అంతర్రాష్ట్ర నిందుతులు అరెస్టు..

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన వైరా ఏసీపీ సారంగపాణి...

డైలీ భారత్, ఖమ్మం: శుక్రవారం వైరా ఎస్‌ఐ రామారావు తన సిబ్బందితో కలిసి వైరా మున్సిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామం వద్ద అంజనేయస్వామి దేవాలయం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించేందుకు వెళ్తుండగా, రోడ్డుపక్కన ఐదు గోనె సంచులతో అనుమానాస్పదంగా నిలబడి ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు.

వారిని తనిఖీ చేయగా, ఐదు గోనె సంచులలో మొత్తం 60 ప్యాకెట్లలో సుమారు 64 లక్షల రూపాయల విలువ చేసే 128 కిలోల ఎండు గంజాయిని ఒరిస్సా లోని మల్కనగిరి ప్రాంతం నుండి తమిళనాడు కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. 

అరెస్టు చేసిన నిందితులు:

మనుయాల్ బోత్రా (22 సం॥లు), రాబా కాలనీ, దొరగూడ పంచాయతీ, చిత్రకొండ బ్లాక్, మల్కాంగిరి జిల్లా, ఒడిశా.

చిటికల సన్యాసినాయుడు (25 సం॥లు), నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

లక్ష్మణ్ కిలో (24 సం॥లు), కమర్గూడ, బోడపొద్దూర్, చిత్రకొండ పోలీస్ స్టేషన్ పరిధి, మల్కాంగిరి జిల్లా, ఒడిశా.

పోలీసుల హెచ్చరిక: సమాజాన్ని నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా, వినియోగం వంటి అక్రమ కార్యకలాపాలపై ఖమ్మం కమిషనరేట్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు.

“డ్రగ్స్‌కు దూరంగా ఉండండి – భవిష్యత్తును కాపాడుకోండి” అని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Image 1

64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు

Posted On 2026-05-15 20:17:21

Readmore >
Image 1

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-05-15 20:09:22

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక... ఘనంగా గ్రంథాలయ దినోత్సవం

Posted On 2026-05-15 20:00:41

Readmore >
Image 1

ఎల్ నినో నీడలో మనిషి : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-15 19:52:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బస్సు, కారు, ద్విచక్ర వాహనం ఢీ..

Posted On 2026-05-15 19:45:39

Readmore >
Image 1

పోలీసుల కృషితో ఇంటికి చేరిన వృద్ధుడు

Posted On 2026-05-15 19:40:30

Readmore >
Image 1

లింగంపేట్, పిట్లం పోలీసుల దాడుల్లో జూదరుల అరెస్ట్

Posted On 2026-05-15 19:39:23

Readmore >
Image 1

క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ

Posted On 2026-05-15 10:30:52

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్ఐ

Posted On 2026-05-14 20:16:30

Readmore >
Image 1

ప్రకృతిని కాపాడు : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-14 19:43:09

Readmore >