| Daily భారత్
Logo




ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

News

Posted on 2026-05-15 20:09:22

Share: Share


ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

డైలీ భారత్, కామారెడ్డి: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది.

ఈ కేసులో భాగంగా కామారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా, ఆయన శుక్రవారం హైదరాబాద్  కమాండ్, కంట్రోల్ టవర్స్‌లోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.

ఉదయం 11 గంటలకు, గంప ప్రసాద్ సిట్ ఎదుట హాజరై తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. 

ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమానాలు, వ్యక్తిగత సమాచారం లీక్ అంశాలపై అధికారులు ప్రశ్నలు అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు.

విచారణ అనంతరం గంప ప్రసాద్ మాట్లాడుతూ,

నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ అధికారులు చెప్పే వరకు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ వల్ల నా వ్యక్తిగత సమాచారం బహిరంగమై, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నా వాంగ్మూలాన్ని వారు రికార్డు చేసుకున్నారు అని తెలిపారు.

గంప ప్రసాద్ వెంట సిట్ కార్యాలయానికి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, అంకం కృష్ణారావు, పల్లె రమేష్ గౌడ్, పాత రాజు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, సుతారి రమేష్, మహమ్మద్ సలీం, కిరణ్, రవీందర్ గౌడ్, వడ్ల సురేష్, టింకు భరత్, ఎజాస్, సుఫియాన్, డేవిడ్, రింకు తదితర కాంగ్రెస్ నాయకులు వెళ్లి సంఘీభావం తెలిపారు.

Image 1

64 లక్షల విలువ చేసే 128 కేజీల గంజాయి పట్టుకున్న వైరా పోలీసులు

Posted On 2026-05-15 20:17:21

Readmore >
Image 1

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-05-15 20:09:22

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక... ఘనంగా గ్రంథాలయ దినోత్సవం

Posted On 2026-05-15 20:00:41

Readmore >
Image 1

ఎల్ నినో నీడలో మనిషి : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-15 19:52:30

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బస్సు, కారు, ద్విచక్ర వాహనం ఢీ..

Posted On 2026-05-15 19:45:39

Readmore >
Image 1

పోలీసుల కృషితో ఇంటికి చేరిన వృద్ధుడు

Posted On 2026-05-15 19:40:30

Readmore >
Image 1

లింగంపేట్, పిట్లం పోలీసుల దాడుల్లో జూదరుల అరెస్ట్

Posted On 2026-05-15 19:39:23

Readmore >
Image 1

క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ

Posted On 2026-05-15 10:30:52

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్ఐ

Posted On 2026-05-14 20:16:30

Readmore >
Image 1

ప్రకృతిని కాపాడు : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-14 19:43:09

Readmore >