| Daily భారత్
Logo




బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

News

Posted on 2026-05-14 15:20:21

Share: Share


బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా 6 ప్రత్యేక చెక్‌పోస్టులు – హెల్ప్‌ లైన్ 8712686133కు సమాచారం అందించండి 

చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా,విద్వేషపూరిత పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవు – జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

డైలీ భారత్, కామారెడ్డి: రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు మరియు ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ 24/7 నిరంతరం పని చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పండుగ సమయంలో ఎవరైనా అనుమానాస్పద ఘటనలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను గమనిస్తే వెంటనే జిల్లా పోలీస్ హెల్ప్‌ లైన్ నంబర్ 8712686133 లేదా అత్యవసర సహాయం కోసం డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.

జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో 6 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, వాటిలో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. 

చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని, వాహనాలను ఆపడం లేదా తనిఖీలు నిర్వహించే అధికారం కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. వ్యక్తులు లేదా సంస్థలు స్వయంగా తనిఖీలకు దిగడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా అనుమానాస్పద స్థితిగతులను గమనించినట్లయితే స్వయంకృత చర్యలకు పాల్పడకుండా, వెంటనే 8712686133 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా అత్యవసర సహాయం కోసం డయల్ 100కు  ఫోన్ చేసి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియా వేదికలపై ద్వేషపూరిత, రెచ్చగొట్టే లేదా మత సామరస్యాన్ని దెబ్బతీసే పోస్టులు, వీడియోలు ప్రచారం చేసే వారిపై పోలీసు నిఘా ఉంటుందని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర గౌరవం, సోదరభావంతో బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సమాచారం అందించే వారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని, ప్రజలందరూ పోలీసులతో సహకరించి జిల్లాలో శాంతిని కాపాడాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్  కోరారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >