| Daily భారత్
Logo




10 వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

News

Posted on 2026-05-13 22:53:45

Share: Share


 10 వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

డైలీ భారత్, కామారెడ్డి: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 2026 లో 10 వ తరగతి పరీక్షా ఫలితాల్లో 550 మరియు ఆ పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమం

550 మరియు ఆపైగా మార్కులు సాధించిన విద్యార్థులు వివరాలు ఈ నెల 18 లోపు తెలియజేయాలి

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 2026 10 వ తరగతి పరీక్షా ఫలితాల్లో 550 మరియు ఆ పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25 సోమవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించాలనే మంచి సంకల్పంతో మొట్టమొదటిసారిగా జిల్లా వ్యాప్తంగా 550 కి పైగా మార్పులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులందరినీ సన్మానించడం జరుగుతుందని ఈ అభినందన సన్మాన కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త, ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ విచ్చేసి విద్యార్థులను అభినందించడం జరుగుతుందని కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య విద్యార్థులు వారి యొక్క వివరాలను కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ బాలు 9492874006 నెంబర్ కి (వాట్సాప్ ద్వారా) తెలియజేయాలని సూచించారు. ఈనెల 18 వ తేదీ లోపు వచ్చిన విద్యార్థులకు మాత్రమే అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందని దీనిని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలు,వాసవి క్లబ్,పట్టణ వైశ్య సంఘాలు సహకరించి ఉత్తమ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాలకు జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ 9849601438,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ 9440054065, కోశాధికారి కస్వ వెంకటేష్ 9848280665,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి 9885707042,ఎర్రం విజయ్ కుమార్ 9491461854 లను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, సలహాదారులు మందుల రామచంద్రం లు పాల్గొనడం జరిగింది.

Image 1

క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ

Posted On 2026-05-15 10:30:52

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్ఐ

Posted On 2026-05-14 20:16:30

Readmore >
Image 1

ప్రకృతిని కాపాడు : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-14 19:43:09

Readmore >
Image 1

"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety) (మీ కోసమే మేమున్నాం)

Posted On 2026-05-14 18:59:23

Readmore >
Image 1

ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ

Posted On 2026-05-14 18:52:34

Readmore >
Image 1

బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Posted On 2026-05-14 18:50:21

Readmore >
Image 1

కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌

Posted On 2026-05-14 18:46:05

Readmore >
Image 1

ఎడవల్లి కృష్ణ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షులు తెలిపిన రాయల శాంతయ్య మరియు నాయకులు

Posted On 2026-05-14 18:45:13

Readmore >
Image 1

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

Posted On 2026-05-14 18:44:01

Readmore >
Image 1

కబేళాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 పశువులు పట్టివేత, ఒక లారీ సీజ్ చేసిన చంద్రుగొండ పోలీసులు

Posted On 2026-05-14 08:26:36

Readmore >