| Daily భారత్
Logo




మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

News

Posted on 2026-05-08 20:03:36

Share: Share


మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి

డైలీ భారత్, కామారెడ్డి : బీఆర్ఎస్, కాంగ్రెస్ జెండాలు వేరైనా అజెండా ఒక్కటే అంటూ బీజేపీ కౌన్సిలర్లు చేసిన వ్యాఖ్యలను గులాబీ పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి తప్పుబట్టారు. పట్టణంలోని  మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్  నివాసంలో శుక్రవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ.. పలు మున్సిపాలిటీలను ఉదహరిస్తూ.. అక్కడ మీరు మద్దతు తెలిపితే తప్పులేదు కానీ.. తాము మద్దతిస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడడం సరికాదన్నారు. ఛైర్మన్, కో–ఆప్షన్ ఎన్నిక సమయంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్​కు మద్దతు తెలపాల్సి వచ్చిందన్నారు. కేవలం కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి కోసమే మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు భైంసా , అమన్ గల్, ఖానాపూర్​తో పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​కు మద్దతు తెలిపి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు బీజేపీ దక్కించుకోలేదా అని నిలదీశారు. విమర్శలు మానుకుని అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని సూచించారు. బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపనతో కామారెడ్డి అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లలో కామారెడ్డికి ఎమ్మెల్యే కేవీఆర్​  చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాసర్ల గోదావరి-స్వామి, కౌన్సిలర్లు అరికెల ప్రభాకర్ యాదవ్, మామిండ్ల లక్ష్మణ్, మన్సూర్ అలీ, అజీజ్, హఫీజ్ బేగ్, లోలం శ్రీనివాస్, కో–ఆప్షన్ సభ్యుడు కుంబాల రవి యాదవ్ పాల్గొన్నారు.

Image 1

ఈవీఎం గోదాంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-05-08 20:04:24

Readmore >
Image 1

మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..

Posted On 2026-05-08 20:03:36

Readmore >
Image 1

జర్నలిస్టుల ఐక్యతకు నూతన వేదిక..

Posted On 2026-05-08 20:00:11

Readmore >
Image 1

జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Posted On 2026-05-08 19:58:59

Readmore >
Image 1

రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు

Posted On 2026-05-08 19:20:14

Readmore >
Image 1

నకిలీ యజమానుల అవతారమెత్తి రూ. 16 లక్షల మోసం

Posted On 2026-05-08 19:16:53

Readmore >
Image 1

మీ పిల్లల భవిష్యత్తు భద్రమేనా.. ! (ఇది మీ కోసమే)

Posted On 2026-05-08 19:15:06

Readmore >
Image 1

ప్రపంచ వేదికపై భారతీయ కళ

Posted On 2026-05-08 17:38:38

Readmore >
Image 1

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

Posted On 2026-05-08 17:04:59

Readmore >
Image 1

“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి

Posted On 2026-05-08 16:57:17

Readmore >