Posted on 2026-05-08 20:00:11
ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు ఆహ్వానం..
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లందరికీ ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐ. ప్రభాకర్ తెలిపారు. ఇటీవల ఘనంగా నిర్వహించిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మీడియా వర్గాల నుంచి విశేష స్పందన లభించింది ప్రెస్ క్లబ్ను జర్నలిస్టుల హక్కులు, ఐక్యత, సంక్షేమానికి అంకితమైన వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రారంభ దశలో 10 మంది సభ్యులతో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పుడు పూర్తి స్థాయి కమిటీ పునర్వ్యవస్థీకరణ కోసం జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి మీడియా ప్రతినిధి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రెస్ క్లబ్ బలోపేతానికి భాగస్వాములు కావాలని కోరారు.
జర్నలిస్టులు, ప్రజలు ప్రెస్ మీట్లు నిర్వహించు కునేందుకు ఆధునిక సదుపాయాలతో ప్రెస్ క్లబ్ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫ్రీ వైఫై, మినరల్ వాటర్, ఏసీ – నాన్ ఏసీ హాళ్లు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల నిఘా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సాధారణ ప్రెస్ మీట్లకు రూ.600, కమర్షియల్ ప్రెస్ మీట్లకు రూ.1000 రుసుము నిర్ణయించినట్లు ఐ. ప్రభాకర్ వెల్లడించారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >