Posted on 2026-05-08 20:00:11
ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యత్వాలకు ఆహ్వానం..
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులు, డిజిటల్ మీడియా ప్రతినిధులు, యూట్యూబర్లు, ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లందరికీ ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐ. ప్రభాకర్ తెలిపారు. ఇటీవల ఘనంగా నిర్వహించిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి మీడియా వర్గాల నుంచి విశేష స్పందన లభించింది ప్రెస్ క్లబ్ను జర్నలిస్టుల హక్కులు, ఐక్యత, సంక్షేమానికి అంకితమైన వేదికగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రారంభ దశలో 10 మంది సభ్యులతో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పుడు పూర్తి స్థాయి కమిటీ పునర్వ్యవస్థీకరణ కోసం జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి మీడియా ప్రతినిధి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రెస్ క్లబ్ బలోపేతానికి భాగస్వాములు కావాలని కోరారు.
జర్నలిస్టులు, ప్రజలు ప్రెస్ మీట్లు నిర్వహించు కునేందుకు ఆధునిక సదుపాయాలతో ప్రెస్ క్లబ్ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫ్రీ వైఫై, మినరల్ వాటర్, ఏసీ – నాన్ ఏసీ హాళ్లు, మరుగుదొడ్లు, సీసీ కెమెరాల నిఘా వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సాధారణ ప్రెస్ మీట్లకు రూ.600, కమర్షియల్ ప్రెస్ మీట్లకు రూ.1000 రుసుము నిర్ణయించినట్లు ఐ. ప్రభాకర్ వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >