| Daily భారత్
Logo




జూలూరుపాడు మండలంలో షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి

News

Posted on 2026-05-08 16:44:09

Share: Share


జూలూరుపాడు మండలంలో షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్

 షరతులు లేకుండా  ధాన్యం, మొక్కజొన్నలు తక్షణమే   కొనుగోలు 

చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కొనుగోళ్లు వద్ద  ధర్నా

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంల కేంద్రాలలో  అకాల వర్షాలకు తడుస్తున్నటువంటి వరి ధాన్యం మొక్కజొన్నలు తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ  సొసైటీ కొనుగోలు కేంద్రం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో  కొనుగోలు కేంద్రాలలో  వేలాది బస్తాలు ధాన్యం, మొక్కజొన్నలు  ములుగుతోందని  అన్నారు. నిబంధనల మేరకు  కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చిన పంటను తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు ఎక్కువగా, రంగు మారింది అంటూ  అధికారులు పలు విధాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.. పంట వివరాలను నమోదు చేయడానికి  యాప్ మూసివేశారని, దీనిపై  అవగాహన లేక పంట వివరాలు నమోదు చేయలేదని  తెలిపారు. అధికారులు రైతు యాప్ ను  నిరంతరం పనిచేసే విధంగా  చర్యలు తీసుకోవాలని కోరారు... ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని  అన్నారు. దీనిని అవకాశం గా తీసుకున్న పలువురు ప్రైవేట్ వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి  రైతులను నిలువునా  ముంచుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు  అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట నష్టం జరుగుతుందని  అన్నదాతలు ఆగమాగం అవుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి పగలు లేకుండా వర్షం పడుతుందేమో అని కాపు కాయాల్సి వస్తుంది దీనివల్ల రైతులు కూడా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది  అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ  గొప్పలు చెప్పుకునే  కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతుందని విమర్శించారు.. ఇకనైనా షరతులు లేకుండా  రైతులు పండించిన మొత్తం పంటలను  కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల యావత్ రైతాంగాన్ని సమీకరించి  ఆందోళన  కు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, ఎల్లంకి మధు తూము కోటయ్య  సిరిపురపు వెంకటేశ్వర్లు గార్లపాటి వీరభద్రం ఎల్లంకి శీను  వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Image 1

ప్రపంచ వేదికపై భారతీయ కళ

Posted On 2026-05-08 17:38:38

Readmore >
Image 1

పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు

Posted On 2026-05-08 17:04:59

Readmore >
Image 1

“ఆ రోజు బ్రోతల్ కీపర్‌లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి

Posted On 2026-05-08 16:57:17

Readmore >
Image 1

చిన్న కొర్రాజుల జాతర మహోత్సవంలో పాల్గొన్న బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-05-08 16:49:46

Readmore >
Image 1

పాపికొండలు విహారయాత్ర తాత్కాలిక రద్దు

Posted On 2026-05-08 16:45:00

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో షరతులు లేకుండా తక్షణమే ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయాలి

Posted On 2026-05-08 16:44:09

Readmore >
Image 1

నూతన జిల్లా DFO ను కలిసిన కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ డిపోల యాజమానుల సంఘం

Posted On 2026-05-08 16:42:57

Readmore >
Image 1

చూపు లేకుండా శిశువు జననం.. తల్లికి రూ.కోటి పరిహారం

Posted On 2026-05-08 12:39:52

Readmore >
Image 1

నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల అరెస్టు

Posted On 2026-05-08 12:30:01

Readmore >
Image 1

అరుదైన వ్యాధి బాధితురాలు సాత్వికకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

Posted On 2026-05-08 11:47:46

Readmore >