Posted on 2026-04-25 19:05:25
డైలీ భారత్, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గోశాలకు వరిగడ్డి వితరణ కార్యక్రమం నిర్వహించబడింది.
గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గూడ దేవేందర్ రెడ్డి శనివారం మూగజీవాలపై తన మమకారాన్ని చాటుతూ మొత్తం 342 వరిగడ్డి కట్టలను గోశాలకు అందజేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ,
“మూగజీవాల సంరక్షణ మన అందరి బాధ్యత. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో గోశాలల్లో ఉన్న పశువులకు తగిన ఆహారం అందించడం చాలా అవసరం. చిన్న సహాయం చేసినా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహాయం చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.
అలాగే, గతంలో కూడా తాను పలుమార్లు గోశాలకు వరిగడ్డి వితరణ చేసినట్లు తెలిపారు.
#Vemulawada #Goshala #AnimalCare #TempleUpdate #asi devendhar reddy
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >