Posted on 2026-04-25 19:28:22
డైలీ భారత్, స్పెషల్:
మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం
పగలు పూట పండుగలతో మెరిసే వీధులు
రాత్రి పడగానే నిశ్శబ్దంగా మారిపోతే
ఆ నిశ్శబ్దంలో వినిపించే ఆకలి మౌన అరుపుతో
మంజుల కలం కన్నీరు పెడుతూ
కవితలు రాస్తున్నాయి..!
హోటల్ వెలుగుల వెనుక
చెత్త బుట్టల దగ్గర అన్నం కోసం వెతికే చేతులు కనిపించినప్పుడల్లా
ఆమె గుండె ఇంకో కవితగా మారుతున్నాయి..!
బాల్యం బొమ్మలతో ఆడుకోవ్వాలి
కాని వీధి మూలలో చేతులు చాచినప్పుడు
ఆకాశానికే ప్రశ్న వేసే ఆ చిన్నారుల కళ్ల కోసం
మంజుల అక్షరాల రూపంలో పురుడు పోసుకుంటున్నాయి..!
ఉన్నవారి ఇంటిలో పండుగల పళ్లెంలో
మిగిలిన అన్నం పడేస్తుంటే...
పక్క వీధిలో ఖాళీ పాత్రలతో
ఒక్క బుక్క దొరుకుతుందా…?
అని ఎదురు చూస్తున్న
వారి ఆకలి కేకల బాధ వినిపించిన ప్రతిసారి
మంజుల హృదయం నుండి
కవిత రూపంలో బయటకు వస్తున్నాయి...
పొయ్యి మౌనంగా ఉన్న ఇళ్లలోని బాధగాలి తాకి ఆమె అక్షరాలు పొగలై పైకి ఎగసి..వారి క్షుద్బాధను
ప్రపంచానికి చెబుతుంది…
ఆకలి అంటే కేవలం కడుపు నొప్పి కాదు
మనసు చిదిమే మౌన అరుపు అని
ప్రతి కవితలో ప్రపంచానికి చెబుతుంది…
ప్లేట్లో మిగిలిన ఒక్క గింజలో
ఎవరో ఒకరి ప్రాణం దాగి ఉందని
చెత్తలో పడేసిన అన్నం
ఎవరో ఒకరి ఆకలి తీరుతున్నది
అని కవితల రూపంలో గుర్తుచేస్తుంది…
గింజ పండించే రైతు చెమటలో
భూమి గుండె చప్పుళ్లు వినిపిస్తాయని
మన ప్లేట్లో మిగిలిన ప్రతి ముద్దలో
అతని కన్నీటి రుచి ఉంటుందని
ప్రపంచానికి గుర్తు చేస్తుంది…
చిల్లిగవ్వ లేని చేతుల్లో
నమ్మకం గింజలు నాటుతుంది...
ఆకలి లేని ఉదయం రావాలని
ప్రతి కవితలో ప్రార్థిస్తుంది మంజుల
ప్రతి పంక్తిలో ఒక వాగ్దానం —
“పంచే చేతులు పెరిగితే
ఆకలి కేకలు మౌనమవుతాయి అని చెబుతుంది...
రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >