Posted on 2026-04-25 17:10:44
సిడబ్ల్యుసి ఎదుట హాజరు పరిచేందుకు బాలిక తరలింపు.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో జరుగుతున్న బాల్యవివాహాన్ని శనివారం అధికారులు అడ్డుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతోందని రెండు రోజుల క్రితం 1098కు సమాచారం అందడంతో తహసీల్దార్ సుజాత, ఐ .సి.డీ.ఎస్. సిరిసిల్ల సీడీపీఓ ఉమారాణి , సూపర్ వైజర్ వనిత, డీ.సి.పీ.ఓ కవిత చైల్డ్లైన్ కోఆర్డినేటర్ స్రవంతి , పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రులను వివరాలు అడిగినా వారు సహకరించకపోగా తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు బాలిక చదివిన పాఠశాల నుంచి రికార్డులు సేకరించగా, 24-08-2009న జన్మించినట్లు ధృవీకరించారు. బాలిక వయస్సు చట్టపరంగా వివాహానికి తక్కువగా ఉండటంతో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి వివాహాన్ని నిలిపివేశారు. ఈ సమయంలో బాలిక బంధువులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అంగన్వాడి టీచర్ సమాచారం ఇచ్చిందని ఆరోపిస్తూ ఆమెపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించిన ఘటన కూడా జరిగింది. అనంతరం బాలికను బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరు పరిచేందుకు సిరిసిల్లకు తరలించారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామస్తులకు బాల్యవివాహాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, అలాంటి వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలను నిరోధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >