| Daily భారత్
Logo




శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

News

Posted on 2026-04-22 16:43:36

Share: Share


శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఆలయ ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన కాలక్షేప (ఆశీర్వచన) మండపాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు. 

అలాగే భక్తుల నివాసార్థం నిర్మించిన గృహాల ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు పలు కాటేజ్ పనులకు శంకుస్థాపన చేశారు.

గత సంవత్సరం శంకుస్థాపన చేసిన పనులకు ఏడాది వ్యవధిలోనే ప్రారంభోత్సవం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఈ సందర్భంగా ఆలయ పాత కమిటీ అధ్యక్షులు మరియు పాలకవర్గ సభ్యుల పదవీకాలాన్ని మరో మూడు సంవత్సరాల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆలయ కమిటీ చైర్మన్‌గా శనిగరం కమలాకర్ రెడ్డి కొనసాగుతుండగా, సభ్యులుగా బండారి యాదగిరి రెడ్డి, గట్టగోని రామ గౌడ్, కొత్త కాపు రాజారెడ్డి, పాత లక్ష్మీరాజ్యం, ఎర్రబోయిన దేవయ్య, కందాడి బాల్ రెడ్డి, కర్రోల్ల శంకర్ గౌడ్, నల్ల అంజయ్య, చింతల నర్సింలు కొనసాగనున్నారు.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ,

చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో మహిమగలదని, స్వామివారి అనుగ్రహంతోనే తనకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కలిగిందని తెలిపారు.

మతభేదాలు లేకుండా భక్తి భావంతో సేవ చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు.

మండుతున్న ఎండల్లో కూడా భారీ సంఖ్యలో వచ్చిన భక్తులను స్వాగతిస్తూ, ఆలయానికి రోడ్డు మరియు విద్యుత్ సౌకర్యాలు కల్పించడం తనకు లభించిన భాగ్యమని అన్నారు.

చైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి విశేషంగా జరిగిందని ప్రశంసిస్తూ, అందుకే ఆయనను తిరిగి చైర్మన్‌గా నియమించామని తెలిపారు.

ప్రతి ఆదివారం ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుందని, కోరికలు కోరిన వారికి స్వామివారు వరప్రదుడిగా నిలుస్తారని అన్నారు.

భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు నర్సింగరావు, రమేష్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నౌసి నాయక్, దేవరాజ్ గౌడ్, సుతారి రమేష్, తిరుమల గౌడ్, బల్యాల సుదర్శన్, ఐరెని నరసయ్య, రాజగౌడ్, గంప ప్రసాద్, గోనే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >