Posted on 2026-04-22 16:40:32
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి: కామారెడ్డి పట్టణం దేవునిపల్లి మధురానగర్ 34వ వార్డులో అంగన్వాడి కేంద్రం సమీపంలో 30 ఫీట్ల ప్రధాన రోడ్డును ఓ వ్యక్తి త్రవ్వేసి నాలుగు ఫీట్ల మేర కబ్జాకు పాల్పడుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని మధురానగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజుల క్రితం రాజు అనే వ్యక్తి తన ప్లాటు రోడ్డులో పోయిందని ఏకంగా దేవునిపల్లి గ్రామపంచాయతీ కాలం నుంచి ఉన్న ప్రధాన మురికికాల్వలను త్రవ్వేశారు. ఈ విషయమై కౌన్సిలర్ ఆకుల సుజిత మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయిన మున్సిపల్ అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోలేదు. రాజు అనే వ్యక్తి బుధవారం రోడ్డు కబ్జా మురికికాలువ నిర్మానం చేపట్టారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి రోడ్డును కాపాడాలని మధురానగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >