Posted on 2026-04-17 13:58:53
డైలీ భారత్, కామారెడ్డి: ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ మాట్లాడారు.క్యాన్సర్ చికిత్సలో వైద్యశాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. సాంప్రదాయ పద్ధతులైన శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్తో పాటు, ఇప్పుడు క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇవి తక్కువ దుష్ప్రభావాలతో, మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
యశోద హాస్పిటల్స్ లో క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం జరుగుతుందన్నారు,హైపర్ స్ట్రైక్ మిషన్ ద్వారా
కణతులను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా చికిత్స చేయవచ్చని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఆందోళన చెందడం సహజం, కానీ సరైన అవగాహన, మానసిక ధైర్యం మరియు చికిత్స ద్వారా దీనిని జయించవచ్చని తెలిపారు. సాధారణంగా స్టేజ్ 4 క్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. అయితే, ఆధునిక వైద్య చికిత్సల వల్ల ఇది ఇప్పుడు పూర్తిగా నయం కాకపోయినా, నియంత్రించగల దీర్ఘకాలిక వ్యాధిగా మారుతోందని పేర్కొన్నారు..
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >