Posted on 2026-04-17 17:28:53
డైలీ భారత్, కామారెడ్డి: ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ కుమార్ మాట్లాడారు.క్యాన్సర్ చికిత్సలో వైద్యశాస్త్రం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. సాంప్రదాయ పద్ధతులైన శస్త్రచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్తో పాటు, ఇప్పుడు క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునే అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇవి తక్కువ దుష్ప్రభావాలతో, మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయన్నారు.
యశోద హాస్పిటల్స్ లో క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం జరుగుతుందన్నారు,హైపర్ స్ట్రైక్ మిషన్ ద్వారా
కణతులను ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని, చుట్టుపక్కల ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా చికిత్స చేయవచ్చని చెప్పారు. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు ఆందోళన చెందడం సహజం, కానీ సరైన అవగాహన, మానసిక ధైర్యం మరియు చికిత్స ద్వారా దీనిని జయించవచ్చని తెలిపారు. సాధారణంగా స్టేజ్ 4 క్యాన్సర్ను పూర్తిగా నయం చేయడం చాలా కష్టం. అయితే, ఆధునిక వైద్య చికిత్సల వల్ల ఇది ఇప్పుడు పూర్తిగా నయం కాకపోయినా, నియంత్రించగల దీర్ఘకాలిక వ్యాధిగా మారుతోందని పేర్కొన్నారు..
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >