Posted on 2026-04-17 17:30:26
అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు
ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి. అతిథి గృహంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పరిధి పేట గ్రామ అంబేద్కర్ బహుజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన బిడ్డ అయిన పల్లె రమేష్ గౌడ్ పై కొంతమంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ చేసిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత, బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు.పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ ప్రజా సేవకుడు అని, అతడు దళితులను అవమానించే వ్యక్తి కాదన్నారు. కులమతాలకు అతీతంగా అందరితో కలసి ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే వారు గ్రామంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తనతో రాజకీయ విభేదాలు ఉంటే గ్రామంలో చూసుకోవాలే తప్ప కొంత మందిని ఉసిగొలిపి ఇలా కేసులు పెట్టించడం తగదని ఫరీద్ పేట గ్రామ సర్పంచ్ నర్సింహ రెడ్డి కి సూచించారు. గ్రామంలో ప్రతీ యేటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో దళితులను ప్రత్యేకంగా పిలిచి బట్టలు పెట్టి పూజలో కూర్చుండబెట్టిన రమేష్ గౌడ్ పైన దళితులను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. గ్రామంలో అభివృద్ధి ఎవరి ద్వారా చేశారో గ్రామంలో నిరూపించుకోవాలని గుర్తు చేశారు ఇప్పటికైనా రమేష్ గౌడ్ పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని లేనియెడల తమ ఇండ్లను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పి చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో దళిత, బహుజన సంఘాల నాయకులు దేవుళ్ళ రాములు, బైండ్ల రామస్వామి, విష్ణు, లక్ష్మీనర్సు, భూమవ్వ, కొంగల లక్ష్మి, రాజమణి, వరలక్ష్మి, తగిరంచ రాజిరెడ్డి, పెరుమాండ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >