Posted on 2026-04-17 15:36:21
డైలీ భారత్, చంద్రంపేట: ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయుల అపరిష్క్రత న్యాయమైన డిమాండ్ల సాధనకై టీజీఈ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శుక్రవారం రోజున చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రధానోపాధ్యాయులు కైరి పద్మ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన్నీరు పద్మజ ఆధ్వర్యంలో నల్ల రిబ్బను దరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదని తక్షణమే డీఏ బకాయిలు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీటీయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండి కొప్పుల రవి మాట్లాడుతూ ప్రభుత్వ జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెల్త్ కార్డులు , పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వడ్యారపు మధుసుధన్, పీ.అనిల్ , వేముల అంజలి, ముంజ రమ, వెంగల పల్లవి తదితరులు పాల్గొన్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >