Posted on 2026-04-17 12:06:21
డైలీ భారత్, చంద్రంపేట: ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయుల అపరిష్క్రత న్యాయమైన డిమాండ్ల సాధనకై టీజీఈ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శుక్రవారం రోజున చంద్రంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రధానోపాధ్యాయులు కైరి పద్మ మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన్నీరు పద్మజ ఆధ్వర్యంలో నల్ల రిబ్బను దరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదని తక్షణమే డీఏ బకాయిలు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీటీయు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండి కొప్పుల రవి మాట్లాడుతూ ప్రభుత్వ జాప్యం కారణంగా రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులతో పాటు సర్వీసులో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెల్త్ కార్డులు , పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో తమ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వడ్యారపు మధుసుధన్, పీ.అనిల్ , వేముల అంజలి, ముంజ రమ, వెంగల పల్లవి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >