Posted on 2023-09-21 21:05:30
డైలీ భారత్, సిరిసిల్ల: సమగ్ర శిక్ష ఉద్యోగు లను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరణ చేపట్టాలని గత 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చేపట్టిన నిరసన దీక్షలను గురువారం విరమించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో, గౌరవ MLC కల్వకుంట్ల కవిత తో తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో జరిగిన చర్చల అనంతరం ఈ క్రింది డిమాండ్స్ నెరవేర్చుతామని చెప్పడం జరిగింది.
1. క్రమబద్ధీకరణ గురించి గౌరవ ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని కనీస వేతన స్కేల్ను వెంటనే అమలు చేయడం.
2. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించడం.
3. PTI (part Time instructure)కు 12 నెలల వేతనం ఇవ్వడం.
4. జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా కల్పించడం.
5. గత 20 రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలకు సైతం వేతనం ఇవ్వడం.
కనీస వేతన స్కేల్ గురించి గౌరవ విద్యాశాఖ మంత్రి విద్య శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన తో ఫోన్లో సంప్రదించి MTS సంబంధించిన నోట్ ఫైల్ తయారు చేయమని ఆదేశాలు ఇచ్చారు. కావున ప్రభుత్వం నుండి ఖచ్చితమైన హామీలు వచ్చినందున, ఇచ్చిన హామీని నెరవేరుస్తారని నమ్మకంతో ఈ నిరసన దీక్షలను తాత్కాలికంగా విరమింప చేస్తున్నాము.
నిరసన దీక్షలకు సహకరించిన వివిధ ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులకు వివిధ రాజకీయ పార్టీలకు సామాజిక సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా తమ కలంతో మా గలాన్ని వినిపించేందుకు వారదులుగా నిలిచిన ప్రింట్ మీడియా పాత్రికేయులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇట్లు ..
సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >