Posted on 2026-04-10 08:36:42
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డిలో ఎన్జీవోస్ కాలనీలో గల ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో ఆయుర్వేద హోమియోపతి యునాని వైద్య శిబిరంను 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ క్యాంప్ చేపట్టి ఉచితంగా మందులు అందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్న ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మరియు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ గారి ఆదేశానుసారము ఈనెల 10వ తేదీన శుక్రవారం నాడు హోమియోపతి, ఆయుష్ డే నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు, చర్మవ్యాధులు మధుమేహము, అర్షమోల, బ్లడ్ ప్రెషర్ మొదలగు దీర్ఘకాలిక అన్ని రకములైన వ్యాధులకు వైద్యులచే పరీక్షించి ఉచితంగా జరిపారు. ఆయుర్వేద, హోమియో, యునాని మందులు అందించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డి ఎం హెచ్ ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు (ఆయుర్వేదం), డాక్టర్ మాలికా జునైడి .(హోమియోపతి ), వైద్యురాలు నహిదా తరుణ్ణం (ఆయుర్వేదం) డాక్టర్ విజయ (యునాని)డాక్టర్ దేవయ్య(ప్రకృతి వైద్యం ) కిషోర్ (ఫార్మసిస్ట్). జ్యోత్స్న(pharm) సుమలత; రాజన్న, సిబ్బంది పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >