| Daily భారత్
Logo




డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

News

Posted on 2026-04-08 21:12:36

Share: Share


డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

డైలీ భారత్, హైదరాబాద్: దేశంలోని మొబైల్ వినియోగదారుల కోసం టెలికం నియంత్రణ సంస్థ  కీలక ప్రతిపాదన చేసింది. కేవలం కాల్స్ మరియు ఎస్ఎంఎస్ సౌకర్యాలు మాత్రమే కోరుకునే వారి కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికం కంపెనీలకు సూచించింది.

డేటా అక్కర్లేని వారికి ఊరట

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రీఛార్జ్ ప్లాన్లు డేటాతో కూడి ఉంటున్నాయి. దీనివల్ల డేటా అవసరం లేని వినియోగదారులు కూడా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. ముఖ్యంగా సాధారణ ఫీచర్ ఫోన్లు వాడే వారు, కేవలం కాల్స్ మాట్లాడుకునే వృద్ధులు మరియు గ్రామీణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ట్రాయ్ ఈ ప్రతిపాదన చేసింది. వాయిస్ కాల్స్, మెసేజ్‌లు మాత్రమే ఉండే ప్లాన్లు అందుబాటులోకి వస్తే రీఛార్జ్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

వ్యాలిడిటీపై స్పష్టత

ప్రస్తుతం డేటా ప్లాన్లు ఏయే వ్యాలిడిటీలతో (ఉదాహరణకు 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు) అందుబాటులో ఉన్నాయో, అదే వ్యాలిడిటీలతో కేవలం "వాయిస్ + ఎస్ఎంఎస్" ప్లాన్లను కూడా ప్రవేశపెట్టాలని టెలికం సంస్థలకు ట్రాయ్ సూచించింది. దీనివల్ల వినియోగదారులకు తమ అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్లను ఎంచుకునే స్వేచ్ఛ లభిస్తుంది. త్వరలోనే జియో, ఎయిర్‌టెల్, విఐ వంటి కంపెనీలు ఈ దిశగా కొత్త ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉంది.

Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >