కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐఏఎస్ సమక్షంలో కంప్యూటర్ల అందజేత.
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా, సరంపల్లిలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల, గతేడాది వచ్చిన భారీ వరదల కారణంగా తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ పూర్తిగా నీట మునిగిపోయి విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారింది. ఈ సమస్యను ప్రిన్సిపల్ బి. అమర్ సింగ్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఐఏఎస్ గారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందిించి తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు.. గ్రీన్కో ఫౌండేషన్ ప్రతినిధులకు, అలాగే ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.