Posted on 2026-04-06 11:06:45
డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ లో తీవ్ర భద్రతా లోపం జరిగింది. ఓ దుండగుడు తన కారుతో అసెంబ్లీ లోపలికి ప్రవేశించాడు. గేటును కారుతో ఢీకొట్టి అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లాడు. గేటు నెంబర్ 2 వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఘటన జరిగింది. కారుకు యూపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నది. ఆ కారులో వచ్చిన డ్రైవర్.. అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా ఆఫీసు దిశగా వెళ్లాడు. అక్కడ నుంచి వెనుదిరిగే ముందు అతను ఫ్లవర్ బొకే ఉంచినట్లు ఢిల్లీ సెక్రటేరియేట్ అధికారి తెలిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతా వైఫల్యం జరిగినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూర్టీ ఉల్లంఘన ఘటన కింద దీన్ని భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ప్రస్తుతం అక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఫ్లవర్ బొకేలో ఎటువంటి పదార్ధం లేదని తేల్చారు.
కారును ట్రేస్ చేసే పనిలో ఢిల్లీ పోలీసులు
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >
ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..
Posted On 2026-04-06 11:06:45
Readmore >
డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
Posted On 2026-04-06 10:51:56
Readmore >
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >