Posted on 2026-04-06 08:30:49
క్షేత్రస్థాయిలో పరిశీలించిన టీజీఎన్పీడీసియల్ సీఎండీ వరుణ్ రెడ్డి.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో మద్దతు అందిస్తుందని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన స్థానిక పవర్లూమ్ (విద్యుత్ మగ్గాల) పరిశ్రమను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మగ్గాల పనితీరు, విద్యుత్ వినియోగ విధానం, ఉత్పత్తి ప్రక్రియలను స్వయంగా పరిశీలించిన సీఎండీ, పరిశ్రమలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా విద్యుత్ ఆదా సాధించడంతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై అధికారులతో చర్చించారు. తరువాత నేతన్నలతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన వరుణ్ రెడ్డి వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ముఖ్యంగా విద్యుత్ రాయితీలు, లో- ఓల్టేజ్ సమస్యలు నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై కార్మికులు తమ విన్నపాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎండీ, విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేతన్నల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్నామని , పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాను అందించడం టీజీఎన్పీడీసియల్ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న ఆయన, నేతన్నల జీవనోపాధి మెరుగుదలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
#Sircilla #sircillanews #rajannasircilla #sircilla rajanna district
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >