Posted on 2026-04-05 12:29:55
రామంతపూర్ వెంకట సాయి నగర్లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్, వెంకట సాయి నగర్ కాలనీలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, నాయి బ్రాహ్మణ సేవ సంఘం మరియు శ్రీ శ్రీ శ్రీ మైసమ్మ దేవాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రతినెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమం ఈ నెల 05-04-2026 ఆదివారం ఉదయం 8:00 గంటల నుండి 11:30 గంటల వరకు విజయవంతంగా జరిగింది. గత రెండు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత ఔషధాలు, రక్తపరీక్షలు అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ శిబిరంలో మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించారు. ముఖ్యంగా థైరాయిడ్ పరీక్షలు, షుగర్ టెస్టులు, రక్తపరీక్షలు నిర్వహించారు.
అలాగే గైనకాలజీ స్పెషలిస్ట్ వైద్యులు, ఆర్థోపెడిక్ నిపుణులు, కంటి సంబంధిత ఆఫ్తమాలజీ వైద్యులు పాల్గొని వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
ఈ శిబిరం ద్వారా కాలనీవాసులు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా లాభపడుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.
సమాజానికి ఉపయోగపడే ఈ తరహా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానిక ప్రజలు ఆకాంక్షించారు.
ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు..
Posted On 2026-04-06 11:06:45
Readmore >
డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
Posted On 2026-04-06 10:51:56
Readmore >
ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పాల్వంచ మండల సర్పంచుల ఫోరం మరియు వివిధ గ్రామ సర్పంచులు
Posted On 2026-04-06 10:25:39
Readmore >
ప్రజల సమస్యలపై స్పందించిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS – వెంటనే చర్యలకు ఆదేశాలు
Posted On 2026-04-06 10:10:44
Readmore >
మద్దికుంటలో ప్యాడ్ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన సర్పంచ్ మనిషా రామస్వామి
Posted On 2026-04-06 09:12:35
Readmore >