| Daily భారత్
Logo




ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులు పై కేసు నమోదు

News

Posted on 2026-04-05 07:47:28

Share: Share


ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులు పై కేసు నమోదు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఇటీవల ప్రభుత్వ బియ్యాన్ని ఆటోలు తరలిస్తుండగా సివిల్ సప్లై ఆరని అడ్డుకున్న వ్యక్తులను రిమాండ్ కు తరలించడం జరిగినది.  వివరాలలోకి వెళితే సుజాతనగర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు అనగా అజ్మీర లక్ష్మణ్, అజ్మీర రాజ్ కుమార్, బండి భాస్కర్ మరియు ఆదినారాయణ అను వ్యక్తులు కొమ్ముగూడెం గ్రామములోని లబ్ధిదారుల వద్ద నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని,తమ వద్ద ఉన్న ట్రాలీఆటోలో లోడ్ చేసుకుని కొత్తగూడెం వైపునకు వెళుతూ ఉండగా,నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు(R.I), కొమ్ముగూడెం గ్రామంలోని పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద ట్రాలీఆటోను ఆపి తనిఖీ చేయగా, సదరు వ్యక్తులు కోపోద్రిక్తులై సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు పై దాడి చేసిన ఘటన విధితమే, అయితే ప్రభుత్వ అధికారిపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించినందుకు గాను, కేసు నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు, సమగ్ర దర్యాప్తు మరియు విచారణను వేగవంతం చేసి, నిందితులను రిమాండ్ నిమిత్తము గౌరవ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి ఎదుట హాజరు పరచడం జరిగినది. ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన లేదా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన చట్టపరమైన చర్యలు తీసుకోని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాధావతు రవి తెలిపినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

గంగల రవీందర్ ముదిరాజ్ ఘనంగా సన్మానం

Posted On 2026-04-06 17:36:35

Readmore >
Image 1

అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?

Posted On 2026-04-06 17:35:37

Readmore >
Image 1

అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ....నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ

Posted On 2026-04-06 17:33:04

Readmore >
Image 1

2020 లాకప్ డెత్ కేసు.. ఏకంగా 9 మంది పోలీసులకు మరణశిక్షలు

Posted On 2026-04-06 17:16:59

Readmore >
Image 1

ఫలించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి

Posted On 2026-04-06 16:46:52

Readmore >
Image 1

"గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బలగాలను ఉపసంహరించుకోబోము." : పశ్చిమ బెంగాల్‌పై సుప్రీంకోర్టు

Posted On 2026-04-06 16:37:10

Readmore >
Image 1

దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్

Posted On 2026-04-06 14:40:01

Readmore >
Image 1

టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం

Posted On 2026-04-06 13:12:02

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై జిల్లా సిసిఎస్ పోలీసుల దాడి

Posted On 2026-04-06 13:10:57

Readmore >
Image 1

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కి గ్రీన్ ఛానల్

Posted On 2026-04-06 12:25:47

Readmore >