Posted on 2026-04-04 16:53:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్పుల తండా గ్రామానికి చెందిన గుగులోత్ రాములు, మేకల కాపరి, తన మేక దొంగతనం జరిగిన విషయమై ఫిర్యాదు చేశాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సూచనలు మేరకు చంద్రుగొండ పోలీసులు “ఆన్ సైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా పోలీస్ అధికారి స్వయంగా బాధితుని వద్దకు వెళ్లి, సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ చేసి బాధితునికి అందజేశారు.
ఫిర్యాదు ప్రకారం, రాత్రి సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఒక బైక్పై వచ్చి బాధితునికి చెందిన మేకను దొంగిలించి వెళ్లినట్లు తెలియజేశారు. బాధితుని వాంగ్మూలం స్వీకరించిన అనంతరం సంఘటన స్థలంలోనే కేసు నమోదు ప్రక్రియ పూర్తి చేసి, బాధితునికి FIR ప్రతిని అందించారు.
ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆన్ సైట్ FIR విధానాన్ని అమలు చేస్తున్నాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు మరియు పోలీస్ స్టేషన్కు స్వయంగా రావడానికి ఇబ్బంది పడే బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రుగొండ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించే దిశగా కట్టుబడి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >