Posted on 2026-04-04 14:53:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జర్పుల తండా గ్రామానికి చెందిన గుగులోత్ రాములు, మేకల కాపరి, తన మేక దొంగతనం జరిగిన విషయమై ఫిర్యాదు చేశాడు తెలంగాణ రాష్ట్ర డీజీపీఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సూచనలు మేరకు చంద్రుగొండ పోలీసులు “ఆన్ సైట్ ఎఫ్ఐఆర్” విధానాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా పోలీస్ అధికారి స్వయంగా బాధితుని వద్దకు వెళ్లి, సంఘటన స్థలంలోనే ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ చేసి బాధితునికి అందజేశారు.
ఫిర్యాదు ప్రకారం, రాత్రి సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఒక బైక్పై వచ్చి బాధితునికి చెందిన మేకను దొంగిలించి వెళ్లినట్లు తెలియజేశారు. బాధితుని వాంగ్మూలం స్వీకరించిన అనంతరం సంఘటన స్థలంలోనే కేసు నమోదు ప్రక్రియ పూర్తి చేసి, బాధితునికి FIR ప్రతిని అందించారు.
ప్రజలకు త్వరితగతిన, పారదర్శకంగా, సౌకర్యవంతమైన పోలీస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆన్ సైట్ FIR విధానాన్ని అమలు చేస్తున్నాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు మరియు పోలీస్ స్టేషన్కు స్వయంగా రావడానికి ఇబ్బంది పడే బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చంద్రుగొండ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, బాధితులకు వేగవంతమైన న్యాయం అందించే దిశగా కట్టుబడి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
ఉద్యమకారుల గౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది : ఎమ్మెల్సీ విజయశాంతి
Posted On 2026-04-04 16:57:11
Readmore >
మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2026-04-04 15:50:27
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-04 15:46:15
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ చెప్పటిన డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-04 15:16:56
Readmore >
స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చండుగొండ ఎస్సై శివరామకృష్ణ
Posted On 2026-04-04 14:53:13
Readmore >
గాలికుంట వ్యాధికి టీకాలు విజయ డైరీ అధ్యక్షులు ఆకుల రవికుమార్
Posted On 2026-04-04 14:09:43
Readmore >
గజ్వేల్ మల్కబావి సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్
Posted On 2026-04-04 13:49:21
Readmore >
కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దోపిడీ... కేసు ఛేదన...నిందితుడు అరెస్ట్, రిమాండ్
Posted On 2026-04-04 13:41:07
Readmore >
నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
Posted On 2026-04-04 12:45:01
Readmore >
కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-04-04 12:42:56
Readmore >