| Daily భారత్
Logo




కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

News

Posted on 2026-04-04 12:42:56

Share: Share


కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఆటలపోటీలలో పాల్గొనడం వల్ల దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని,మరింత ఆరోగ్యవంతులవుతారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన గాయత్రి క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ-2026 ప్రారంభించారు.ఈ పోటీలను ప్రారంభించేందుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక యువకులు బాణసంచా పేల్చి,డప్పు వాయిద్యాలతో ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులకు ఘన స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్,వనమా రాఘవ,కాపు సీతామహాలక్ష్మీ,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ తదితర ప్రముఖులు అమరవీరుల స్థూపానికి పూలుజల్లి నివాళులర్పించారు.ఎంపీ రవిచంద్ర టాస్ వేసి బ్యాటింగ్ చేసి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించారు.ఈ పోటీల నిర్వాహకులు బీ.శ్రీనివాస్,కన్నిలు ఎంపీ రవిచంద్రకు క్రికెట్ టీం సభ్యులను పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రికెట్ లో మన భారత జట్టు అత్యుత్తమ ప్రతిభాపాటవాలు కనబర్చుతున్నదని కొనియాడారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని,ఈ రంగంలో కూడా గొప్పగా ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,రంగనాథ్,బాదావత్ శాంతి నాయక్,కార్పోరేటర్స్ మల్హోత్రా సాగర్,కాలేరు సింధూ తపస్వి,బొమ్మిడి రమాకాంత్,బాదావత్ శ్రీకాంత్,నవతన్,బొమ్మిడి శ్రీకాంత్,అనుదీప్ తదితరులతో పాటు వందలాది మంది యువత పాల్గొన్నారు.

Image 1

ఉద్యమకారుల గౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది : ఎమ్మెల్సీ విజయశాంతి

Posted On 2026-04-04 16:57:11

Readmore >
Image 1

మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Posted On 2026-04-04 15:50:27

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-04 15:46:15

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ చెప్పటిన డిఎస్పీ నాగేంద్రచారి

Posted On 2026-04-04 15:16:56

Readmore >
Image 1

స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చండుగొండ ఎస్సై శివరామకృష్ణ

Posted On 2026-04-04 14:53:13

Readmore >
Image 1

గాలికుంట వ్యాధికి టీకాలు విజయ డైరీ అధ్యక్షులు ఆకుల రవికుమార్

Posted On 2026-04-04 14:09:43

Readmore >
Image 1

గజ్వేల్ మల్కబావి సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్

Posted On 2026-04-04 13:49:21

Readmore >
Image 1

కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దోపిడీ... కేసు ఛేదన...నిందితుడు అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-04-04 13:41:07

Readmore >
Image 1

నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

Posted On 2026-04-04 12:45:01

Readmore >
Image 1

కొత్తగూడెం ప్రగతి మైదానంలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-04-04 12:42:56

Readmore >