Posted on 2026-04-04 05:14:17
డైలీ భారత్, వెల్దండ : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రుద్రాక్ష మహేష్ శుక్రవారం రాత్రి వెల్దండ నుంచి కారులో బయల్దేరాడు. ఈ క్రమంలో ఓ టిప్పర్ అతడి కారును ఢీకొట్టింది. కావాలనే యాక్సిడెంట్ చేసి, తరువాత రాళ్లతో మోది హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై కురుమూర్తిలు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాత కక్షలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రియురాలు ఫోన్ బ్లాక్ చేసిందని.. హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు
Posted On 2026-04-04 06:39:15
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా... సురక్షిత సమాజంకోసం – సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి : ప్రభుత్వ విప్
Posted On 2026-04-04 06:08:38
Readmore >
బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్ లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త!!
Posted On 2026-04-04 05:32:56
Readmore >