| Daily భారత్
Logo




రక్తదాన శిబిరం తో ఆదర్శంగా నిలిచిన ధర్మారావుపేట గ్రామం

News

Posted on 2026-04-01 15:22:44

Share: Share


రక్తదాన శిబిరం తో ఆదర్శంగా నిలిచిన ధర్మారావుపేట గ్రామం

తల సేమియా వ్యాధి చిన్నారుల కోసం రక్తదాన శిబిరం

ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్

డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ధర్మరావుపేట గ్రామంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్,ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, వార్డు సభ్యులు,యువజన సంఘాల సహకారంతో నిర్వహించిన రక్తదాన శిఖరం విజయవంతం కావడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు తెలియజేశారు.47 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలుస్తున్న రక్తదాత సామల సంతోష్ రెడ్డి ని సన్మానించడం జరిగింది.ఈ రక్తదాన శిబిరంలో 51 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు, ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ షేక్ ఉమర్,ఉప సర్పంచ్ లు,యువ పాలకవర్గం తలసేమియా వ్యాధి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి కామారెడ్డి జిల్లాకే ఆదర్శంగా నిలవడం జరిగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ చిన్నారులకు ప్రతి 15 రోజులకు రక్తం జీవితాంతం అవసరం ఉంటుందని వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉన్నదని అన్నారు.రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్ లు,టిఫిన్ బాక్స్ లను అందజేసిన దాతలు కమ్మరి ప్రవీణ్,దోమకొండ శ్రీనివాస్,మందుల రామచంద్రం లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకన్న,ఎల్లంకి సుదర్శన్,నంగునూరి కాశీనాథం గ్రామ యువత పాల్గొనడం జరిగింది.

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >