Posted on 2026-03-31 07:34:18
ప్రధాన రహదారిపై తెగిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన తేజ
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తంగలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల సమయంలో సిరిసిల్ల డిఎస్పీ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రాత్రి సమయంలో వచ్చిన గాలి తడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడి ఉండగా,అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తూ అటు వైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ తేజ పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.వాహనాన్ని ఆపి ప్రమాదాన్ని అంచనా వేసి డిఎస్పీ కి తెలియజేయాగ వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసి వైర్లను సరిచేయడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తమై వ్యవహరించి డ్రైవర్ తేజ చూపిన చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు పోలీస్ అధికారులు అభినందించారు.డ్రైవర్ అంటే కేవలం వాహనం నడిపేవారే కాకుండా,అప్రమత్తతతో ప్రజల ప్రాణాలను కాపాడగల బాధ్యతగల వ్యక్తి అని తేజ నిరూపించారు.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >