Posted on 2026-03-30 18:39:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్కు చెందిన భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ను బీఆర్ఎస్ కొత్తగూడెం మజీ మండల అధ్యక్షులు ఎండీ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, స్మారక చిహ్నాన్ని అందజేశారు.
సీఐ నరేష్ కుమార్ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవను ప్రశంసించారు.
ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మజీ మండల అధ్యక్షుడు ఎండి హుస్సేన్, నాయకులు నజీర్,శ్యామ్, ఖాదర్, సతీష్, మోహన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >