Posted on 2026-03-28 17:03:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను శనివారం రోజున ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో రికార్డులను, స్కానింగ్ సెంటర్ల మిషన్ లను పరిశీలించారు. ఫారం ఎఫ్ ఆడిట్లను పరిశీలించి గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు సంతకాలు తీసుకొని, గర్భిణీ స్త్రీ స్కానింగ్ వివరాల ఫిలింను జత పరచాలని సూచిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా గర్భిణీ స్త్రీ కి ఆడ మగ (లింగ నిర్ధారణ) అని సైగల ద్వారా తెలియజేసిన స్కానింగ్ సెంటర్ లను సిజ్ చేస్తామని, 10,000 రూపాయల జరిమానా విధిస్తూ, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని స్కానింగ్ నిర్వాహకులను హెచ్చరించారు, రిజిస్ట్రేషన్ లేని ప్రైవేట్ ఆస్పత్రులను నిర్వహించినట్లయితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, నవీన పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >
అక్రమ బేకరీపై పోలీసుల దాడి – భారీగా కల్తీ ఉత్పత్తులు స్వాధీనం, ఒకరి అరెస్ట్
Posted On 2026-03-28 13:46:33
Readmore >