Posted on 2026-03-26 19:16:04
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండల నాయకులు కాకర్ల గ్రామానికి చెందిన చెంగల గురునాధం ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని కాకర్ల గ్రామానికి విచ్చేసి సందర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.కుటుంబానికి ఎం ఆర్ పి ఎస్ అండగా ఉంటుందని హామి ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ తొలి తరం నాయకులు మండలంలో ఉద్యమాన్ని నడిపించిన మోదుగు ఆదాం,ప్రభాకర్, వేల్పుల నరసింహరావు,మిరియాల ఫ్రాన్సిస్, కిన్నెర దేవయ్య తో పాటు ఎం ఆర్ పి ఎస్ నాయకులు కొత్తపల్లి సోమయ్య,ఏపూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు తగరం వెంకట నరసింహారావు, మండల అధ్యక్షులు దెబ్బెందుల సాయి కుమార్, వేల్పుల భాస్కర్, ఖమ్మం జిల్లా నాయకులు తూరుగంటి అంజయ్య,దేపంగి రమణయ్య, మంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >