Posted on 2026-03-19 17:22:18
వేములవాడ దేవస్థానానికి గౌరవం
డైలీ భారత్, హైదరాబాద్: ఈరోజు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ప్రముఖులు పురస్కారాలు అందుకోవడం విశేషంగా నిలిచింది.
దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ సురేష్ , అలాగే నాదస్వర కళాకారుడు ఎన్. శ్రీనివాస్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ పురస్కారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు, ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉగాది పురస్కారాలను అందుకున్న దేవస్థానం సిబ్బందికి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల్. రమాదేవి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానం ప్రతిష్ఠ మరింత పెరిగిందని భక్తులు మరియు అధికారులు అభిప్రాయపడ్డారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >