Posted on 2026-03-19 21:52:18
వేములవాడ దేవస్థానానికి గౌరవం
డైలీ భారత్, హైదరాబాద్: ఈరోజు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉగాది పురస్కారాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ప్రముఖులు పురస్కారాలు అందుకోవడం విశేషంగా నిలిచింది.
దేవస్థానం ప్రధాన అర్చకులు ఈశ్వర్ సురేష్ , అలాగే నాదస్వర కళాకారుడు ఎన్. శ్రీనివాస్ ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఈ పురస్కారాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డైరెక్టర్ ఎం. హనుమంతరావు, ఐఏఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉగాది పురస్కారాలను అందుకున్న దేవస్థానం సిబ్బందికి ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల్. రమాదేవి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దేవస్థానం ప్రతిష్ఠ మరింత పెరిగిందని భక్తులు మరియు అధికారులు అభిప్రాయపడ్డారు.
10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...
Posted On 2026-07-03 09:50:18
Readmore >
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >