Posted on 2026-03-17 02:25:16
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి మందులను తక్షణమే నిషేధించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ బృందం అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి నివేదికను అందజేశారు.ప్రపంచవ్యాప్తం గా దాదాపు 70కి పైగా దేశాల్లో ఈ ప్రమాదకర రసాయనాలను నిషేధించారని తెలిపారు. కానీ మన దేశంలో ఇవి విచ్చలవిడిగా దొరుకుతు న్నాయని కమిషన్ పేర్కొంది.గ్రామీణ, తండా ప్రాంతాల్లో రైతులు క్షణికావేశంలో వీటిని తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ మందుల నిషేధాన్ని సమర్థిస్తోందని, ప్రజారోగ్యం దృష్ట్యా వీటిని అరికట్టాలని నివేదికలో వివరించారు. తెలంగాణలో ఈ మందులను నిషేధించడంతో పాటు, దేశవ్యాప్తంగా వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయాలని ముఖ్యమం త్రిని కోరాడు. రైతు కమిషన్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతక మైన ఈ విష రసాయనాలను రాష్ట్రంలో నిషే ధించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
అంచనూర్ గ్రామ పంచాయతీ నిధుల గోల్ మాల్! చేస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్ జనగామ నరేష్?
Posted On 2026-04-06 17:35:37
Readmore >
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ జారీ....నిరంతరం అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ
Posted On 2026-04-06 17:33:04
Readmore >
"గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బలగాలను ఉపసంహరించుకోబోము." : పశ్చిమ బెంగాల్పై సుప్రీంకోర్టు
Posted On 2026-04-06 16:37:10
Readmore >
దేవునిపల్లిలోని కల్కి నగర్ కాలనీలో జూదం స్థావరంపై పోలీసుల మెరుపు దాడి... 9 మంది అరెస్ట్
Posted On 2026-04-06 14:40:01
Readmore >
టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన : జిల్లా బృందం
Posted On 2026-04-06 13:12:02
Readmore >
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్
Posted On 2026-04-06 12:25:47
Readmore >