Posted on 2026-03-17 07:55:16
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి మందులను తక్షణమే నిషేధించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ బృందం అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి తోపాటు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి నివేదికను అందజేశారు.ప్రపంచవ్యాప్తం గా దాదాపు 70కి పైగా దేశాల్లో ఈ ప్రమాదకర రసాయనాలను నిషేధించారని తెలిపారు. కానీ మన దేశంలో ఇవి విచ్చలవిడిగా దొరుకుతు న్నాయని కమిషన్ పేర్కొంది.గ్రామీణ, తండా ప్రాంతాల్లో రైతులు క్షణికావేశంలో వీటిని తాగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఈ మందుల నిషేధాన్ని సమర్థిస్తోందని, ప్రజారోగ్యం దృష్ట్యా వీటిని అరికట్టాలని నివేదికలో వివరించారు. తెలంగాణలో ఈ మందులను నిషేధించడంతో పాటు, దేశవ్యాప్తంగా వీటిపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయాలని ముఖ్యమం త్రిని కోరాడు. రైతు కమిషన్ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతక మైన ఈ విష రసాయనాలను రాష్ట్రంలో నిషే ధించేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >