Posted on 2026-03-14 13:05:35
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని పోచారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
పోచారం పరిధికి చెందిన మనోహర్ యువకుడు ఎయిడ్స్ బాధితుడు. మనోహర్తో అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని దాచి ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. అయితే ఎయిడ్స్ ఉందని తేలడంతో ఆ పెళ్లికి యువతి నిరాకరించింది. దీంతో సదరు యువతిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి మనోహర్ వెళ్లాడు. తనతో పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తడి చేశాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్షతో తన రక్షంతో కూడిన ఇంజెక్షన్ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు.
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >
పిల్లల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత : ఆడెపు వేణు, లోక్ అదాలత్ సభ్యులు
Posted On 2026-05-08 17:04:59
Readmore >
“ఆ రోజు బ్రోతల్ కీపర్లా వెళ్లాను.. రెండు గంటలు తీవ్ర టెన్షన్ పడ్డాను..” : మల్కాజిగిరి సీపీ సుమతి
Posted On 2026-05-08 16:57:17
Readmore >