Posted on 2026-03-14 13:05:35
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని పోచారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
పోచారం పరిధికి చెందిన మనోహర్ యువకుడు ఎయిడ్స్ బాధితుడు. మనోహర్తో అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని దాచి ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. అయితే ఎయిడ్స్ ఉందని తేలడంతో ఆ పెళ్లికి యువతి నిరాకరించింది. దీంతో సదరు యువతిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి మనోహర్ వెళ్లాడు. తనతో పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తడి చేశాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్షతో తన రక్షంతో కూడిన ఇంజెక్షన్ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >