Posted on 2026-03-14 13:05:35
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్లోని పోచారంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి నిరాకరించిందని ఓ యువతికి ఎయిడ్స్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
పోచారం పరిధికి చెందిన మనోహర్ యువకుడు ఎయిడ్స్ బాధితుడు. మనోహర్తో అతని తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని దాచి ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. అయితే ఎయిడ్స్ ఉందని తేలడంతో ఆ పెళ్లికి యువతి నిరాకరించింది. దీంతో సదరు యువతిపై మనోహర్ కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి మనోహర్ వెళ్లాడు. తనతో పెళ్లికి ఒప్పుకోవాలని ఒత్తడి చేశాడు. కానీ అందుకు యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్షతో తన రక్షంతో కూడిన ఇంజెక్షన్ను ఆమెకు బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు.
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >