Posted on 2023-09-18 09:42:42
డైలీ భారత్, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చినపుడు సమన్వయం పాటించాలని, వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ కోరారు.
రెండు రోజుల సీడబ్ల్యూసీ సమావేశాల్లో భాగంగా అయిదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై ఆదివారం జరిగిన చర్చ సందర్భంగా సోనియా జోక్యం చేసుకుని మీడియా సమావేశాల సందర్బంగా నాయకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వీలైతే మీడియాకు దూరంగా ఉండాలని, లేదంటే పొరపాటుగా చేసే చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రయోజనాలను పక్కనబెట్టి పార్టీ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఐఖ్యత, క్రమశిక్షణతోనే విరోధులను జయించగలమని, ఇది కర్ణాటక ఎన్నికల్లో నిరూపితమైందని గుర్తు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >