Posted on 2026-03-10 17:50:14
హైదరాబాద్ కేంద్రంగా మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్ల ప్రతిపాదన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ వద్ద హైస్పీడ్ రైల్ టెర్మినల్కు మెట్రో రైలు అనుసంధానం
విమానాశ్రయం, ఓఆర్ఆర్, మెట్రో, బుల్లెట్ రైలు ఒకేచోట కలిసేలా మెగా జంక్షన్
ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి అధ్యయనానికి అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు
రాజధాని నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. నగర శివారులోని శంషాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న హైస్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) నెట్వర్క్ను మెట్రో రైలుతో అనుసంధానించే బృహత్ ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మెగా ప్రాజెక్టుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల కోసం శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న బహదూర్గూడ, రషీద్గూడ ప్రాంతాల్లో భారీ టెర్మినల్ నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన సుమారు 500 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత చూపింది.మరోవైపు, మెట్రో రెండో దశలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొత్త లైన్లు నిర్మిస్తున్నారు. ఈ మెట్రో మార్గాలను నేరుగా ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ టెర్మినల్తో కలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ అనే నాలుగు ప్రధాన రవాణా వ్యవస్థలు ఒకేచోట కలిసేలా ఒక మెగా జంక్షన్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Posted On 2026-03-10 20:55:00
Readmore >
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
Posted On 2026-03-10 20:28:52
Readmore >
సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం
Posted On 2026-03-10 18:48:11
Readmore >
ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
Posted On 2026-03-10 18:22:28
Readmore >