| Daily భారత్
Logo




ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

News

Posted on 2026-03-10 17:45:25

Share: Share


ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

విలేఖరుల సమావేశంలో ఉదండాపూర్ పరిహారం పెంపు జీవోను చూపుతున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

సింగిల్ ఫ్యామిలీ పరిహారం రూ.6 నుంచి 18 లక్షలు పెంచాం

జాయింట్ ఫ్యామిలీ పరిహారం రూ.16 నుంచి 18 లక్షలు చేసాం

తేడాల్లేకుండా అందరికీ సమానమైన పరిహారం ఇస్తాం

2 నెలల్లోనే రూ.374 కోట్ల పరిహారం చెల్లిస్తాం

ప్లాట్లు కూడా ఉచితంగా  రిజిష్టర్ చేసి ఇప్పిస్తాం

ఇప్పుడు కూడా ప్రాజెక్టు పనులను  అడ్డుకుంటే ఊరుకోం

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ


డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తాను హామీ ఇచ్చిన విధంగానే ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇచ్చే పరిహారాన్ని పెంచామని ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులను ఎవరైనా అడ్డుకుంటే తాను ఊరుకోనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అవార్డు పాసైన తర్వాత పరిహారాన్ని పెంచిన దాఖలాలు ఎక్కడా లేవని కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రత్యేకంగా ఉదండాపూర్ నిర్వాసితులకే పరిహారాన్ని పెంచారని వివరించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం క్రిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే తేడాను చూపించి, సింగిల్ ఫ్యామిలీకి రూ.6.5 లక్షలు, జాయింట్ ఫ్యామిలీకి రూ.16 లక్షలు పరిహారంగా నిర్ణయించారని చెప్పారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో ఇలాంటి తేడాలు చూపించలేదన్నారు. అయితే ప్రస్తుతం తమ ప్రభుత్వం సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ ఒకే పరిహారంగా రూ.18 లక్షలు ప్రకటించిందని తెలిపారు. దీంతో నిర్వాసితులకు రూ. 2 నుంచి రూ.12 లక్షల దాకా అదనపు పరిహారం లభిస్తుందన్నారు. ఇదివరకే పరిహారం మొత్తాలను అందుకున్న వల్లూరు, వల్లూరు తాండాలకు కూడా పెంచిన అదనపు పరిహారాన్ని ప్రభుత్వం అందించనుందని  చెప్పారు. పెంచిన పరిహారం కోసం అదనంగా రూ.146 కోట్లతో కలిపి మొత్తం రూ.374 కోట్ల మొత్తాన్ని రెండు నెలల్లోపుగా నిర్వాసితులకు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని గుర్తు చేసారు. అదనపు పరిహారం కోసం విడుదల చేసిన జీవో నెంబర్.1 కేవలం ఉదండాపూర్ నిర్వాసితులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంపు సమస్య పరిష్కారమైన నేపథ్యంలో ఉదండాపూర్ ప్రాజుక్టు పనులు సాఫీగా కొనసాగించడానికి అందరూ సహకరించాలని కోరారు. ఇప్పుడు కూడా ఎవరైనా చిల్లర రాజకీయాలు చేసి  ప్రాజెక్టు పనులను అడ్డుకోడం జరిగితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగిస్తే గడువు లోపుగా రిజర్వాయర్ పనులు పూర్తి చేయలేమన్నారు. అలాగే  నిర్వాసితులకు ఇచ్చే ప్లాట్లను కూడా రిజిష్టర్ చేసి ఇవ్వాలని తాను మంత్రి ఉత్తమ్ ను కోరారని, ఆయన కూడా దీనికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు కూడా ప్లాట్లను ప్రభుత్వమే ఉచితంగా రిజిష్టర్ చేసి ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. 

Image 1

చండ్రుగొండ మండలంలో మహిళా హత్యకేసులో నిందితుడు అరెస్ట్

Posted On 2026-04-30 09:56:08

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >