Posted on 2026-03-10 11:54:35
డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ భగయత్ వెంకట సాయి నగర్ కాలనీ లో నిర్వహించిన బస్తి బాట కార్యక్రమంలో ఏ డి ఈ రవీందర్ మరియు ఏ ఈ కిరణ్ కుమార్ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కాలనీ ప్రజల విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, వినియోగదారుల ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.
సన్నగా మారిన కండక్టర్ వైర్లను భద్రతా కేబుల్ వైర్తో భర్తీ చేయడం తో పాటు, కాలనీలో ఉన్న లో వోల్టేజ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలకు ఏ సమయంలోనైనా విద్యుత్ సమస్యల పరిష్కారం అందేలా విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని ఏ డి ఈ రవీందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఆర్ గోవింద్, రామకృష్ణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >