Posted on 2026-03-09 15:50:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో వివిధ క్రీడలు, రక్షణ, పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కీర్తిస్తూ చంద్రంపేటకు చెందిన వెల్ది రేఖ మూడు నెలల పాటు శ్రమించి రూపొందించిన నారీశక్తి చీరను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆద్వర్యంలో వనిత చేయూత.. మహిళా సాధికారత కింద ముస్తాబాద్ మండలానికి చెందిన మహిళలకు కుట్టు శిక్షణ అందించి.. వారికి సర్టిఫికెట్లు, కుట్టు మెషిన్లు కలెక్టర్ చేతుల మీదుగా అపెరల్ పార్క్ లో అందజేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ పొందిన మహిళలు నేర్చుకున్న మెళకువలు ఉపాధి పొందడంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, టీడీఎఫ్ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >