Posted on 2026-03-09 20:20:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో వివిధ క్రీడలు, రక్షణ, పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కీర్తిస్తూ చంద్రంపేటకు చెందిన వెల్ది రేఖ మూడు నెలల పాటు శ్రమించి రూపొందించిన నారీశక్తి చీరను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆద్వర్యంలో వనిత చేయూత.. మహిళా సాధికారత కింద ముస్తాబాద్ మండలానికి చెందిన మహిళలకు కుట్టు శిక్షణ అందించి.. వారికి సర్టిఫికెట్లు, కుట్టు మెషిన్లు కలెక్టర్ చేతుల మీదుగా అపెరల్ పార్క్ లో అందజేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ పొందిన మహిళలు నేర్చుకున్న మెళకువలు ఉపాధి పొందడంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, టీడీఎఫ్ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >
"అక్షయ తృతీయ" నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే "సింహాచలం అప్పన్న" స్వామి
Posted On 2026-04-18 13:51:32
Readmore >