Posted on 2026-03-09 20:20:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్ లో వివిధ క్రీడలు, రక్షణ, పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను కీర్తిస్తూ చంద్రంపేటకు చెందిన వెల్ది రేఖ మూడు నెలల పాటు శ్రమించి రూపొందించిన నారీశక్తి చీరను కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆద్వర్యంలో వనిత చేయూత.. మహిళా సాధికారత కింద ముస్తాబాద్ మండలానికి చెందిన మహిళలకు కుట్టు శిక్షణ అందించి.. వారికి సర్టిఫికెట్లు, కుట్టు మెషిన్లు కలెక్టర్ చేతుల మీదుగా అపెరల్ పార్క్ లో అందజేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కుట్టు శిక్షణ పొందిన మహిళలు నేర్చుకున్న మెళకువలు ఉపాధి పొందడంలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ గీత, చేనేత జౌళి శాఖ ఏడీ సంతోష్, టీడీఎఫ్ అధ్యక్షుడు మట్టా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష
Posted On 2026-04-29 18:50:39
Readmore >
మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్
Posted On 2026-04-29 18:39:55
Readmore >
పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565
Posted On 2026-04-29 18:37:39
Readmore >
ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
Posted On 2026-04-29 17:26:42
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >