Posted on 2026-03-09 08:28:46
మహిళామూర్తులకు బిజెపినేత "గాయత్రి" ఆధ్వర్యంలో ఘనసన్మానం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పునర్కరించుకుని బిజెపి నాయకురాలు సముద్రాల గాయత్రి ఆధ్వర్యంలో ఘనంగా మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆదివారం కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్, గాజులరాజం బస్తి పరిధిలో గల తన ఇంటి వద్ద 60 సంవత్సరాలు దాటిన వృద్ధ మహిళలకు పట్టు శాలువా కప్పి వారికి నూతన వస్త్రాలని అందజేశారు. ఈ సందర్భంగా సదరు మహిళల చే ఆశీస్సులు తీసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా గాయత్రి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి రంగంలో తమ ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. నారీ శక్తులుగా ప్రతి రంగంలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు, మహిళా సాధికారత సాధించేందుకు ప్రతి ఒక్కరం పునరంకితమవుదామని వివరించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ సీనియర్ సిటిజన్ మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ
Posted On 2026-03-09 19:09:41
Readmore >